హైదరాబాద్: కార్లలో ఆరు ఎయిర్బ్యాగులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న నిబంధన అమలును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది అక్టోబర్కి వాయిదా వేసింది. వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచే ఇది అమల్లోకి రావాల్సి ఉండగా.. వివిధ కారణాల రీత్యా దీన్ని ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వెల్లడించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి ప్యాసింజర్ కార్ల(ఎం-1 కేటగిరి)లో ఆరు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా అన్ని కార్లలో దీన్ని అమలుచేయాలని పేర్కొన్నారు. కేంద్ర మోటారు వాహనాల చట్టానికి ఈ ఏడాది జనవరిలో కేంద్రం సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రతి ప్యాసింజర్ కారులోనూ విధిగా ఆరు ఎయిర్బ్యాగ్స్ (నాలుగు సీట్లతో సహా రెండు సైడ్ ఎయిర్బ్యాగులు) ఉండాలని పేర్కొన్నారు. అయితే, సరఫరాలో పరిమితులతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, స్థూల ఆర్థిక ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని నిబంధన అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు గడ్కరీ వెల్లడించారు.