5G Launch in India | టెక్నాలజీ రంగంలో సరికొత్త మార్పు రాబోతోంది. త్వరలో భారత్లో 5జీ నెట్వర్క్ లాంచ్ కాబోతోంది. 2022లో భారత్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్(డీవోటీ) ప్రకటించింది.
కాకపోతే ముందు దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, హైదరాబాద్, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పూణెలో ముందు 5జీ సేవలు లాంచ్ కానున్నాయి.
అయితే.. ఏ టెలికాం ఆపరేటర్ ముందు 5జీ సేవలను ప్రారంభిస్తుందో దానిపై సమాచారం లేదు. కాకపోతే జియో, ఎయిర్టెల్, వీఐ(వొడాఫోన్ ఇండియా) లాంటి నెట్వర్క్స్ ఇప్పటికే కొన్ని నగరాల్లో 5జీ సేవలపై ట్రయల్ సైట్స్ను సెటప్ చేశాయి.