న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశంలో మరణ శిక్ష పడిన 561 మంది ఖైదీలు చావు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత సంఖ్యలో మరణ శిక్ష పడిన ఖైదీలు ఉండటం గత రెండు దశాబ్దాల కాలంలోనే అత్యధికం. 2015 నుంచి వీరి సంఖ్య 45.71 శాతం పెరిగినట్టు ఢిల్లీకి చెందిన నేషనల్ లా యూనివర్సిటీలో ప్రచురించిన ‘డెత్ పెనాల్టీ ఇండి యా’ తన నివేదికలో వెల్లడించింది.
2023లో ట్రయల్ కోర్టులు 120 మందికి మరణ శిక్ష విధించాయి. ఇక హైకోర్టుల విషయానికొస్తే కర్ణాటక హైకోర్టు 2023లో ఒక మరణ శిక్షను ఖరారు చేసింది. 2000 నుంచి చూస్తే అప్పీలేట్ కోర్టులు 2023లో అతి తక్కువ శాతం మరణ శిక్షను ఖరారు చేశాయి.