న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ 50,407 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 13 శాతం తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రికవరీ కేసుల సంఖ్య 1,36,962గా ఉంది. గడిచిన 24 గంటల్లో 804 మరణాలు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,443. ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 5,07,981గా ఉందని ఆరోగ్య శాఖ చెప్పింది. డెయిలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు ఇండియాలో 1,72,29,47,688 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.