న్యూఢిల్లీ: దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లను ఓ వ్యక్తి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్టు ‘సైబర్న్యూస్’ వెల్లడించింది. 48.7 కోట్ల మంది ఫోన్ నంబర్లతో కూడిన 2022 డాటాబేస్ను విక్రయిస్తానంటూ ఆ వ్యక్తి హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరంలో ఓ ప్రకటనను పోస్టు చేసినట్టు తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు, ఫోన్కాల్స్కు స్పందించవద్దని వాట్సాప్ వినియోగదారులకు సూచించింది.