న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా దేశంలో 50 ఎయిర్పోర్టులు, హెలీపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్లు, అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్లను పునరుద్ధరించనున్నట్లు ఆమె బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.
బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా, పోర్టులకు మొదటి, చివరి మైలు రవాణా సౌకర్యం కల్పించడానికి 100 ప్రాజెక్టులను గుర్తించినట్లు ఆమె తెలిపారు. రూ.75 వేల కోట్లతో వీటిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తామని, ఇందులో రూ.15 వేల కోట్ల మేర ప్రైవేటు నిధులను వినియోగించనున్నట్టు చెప్పారు.