భోపాల్: మధ్యప్రదేశ్లోని కట్ని జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం (Tunnel) కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు అందులో చిక్కుకుపోయారు. కట్నీ జిల్లా స్లిమ్నాబాద్లో నర్మదా వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా బార్గీ డ్యామ్ నుంచి బన్సాగర్ వరకు సొరంగం నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సొరంగం కూలిపోయింది.
సొరంగంలో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఐదుగురిని రక్షించినట్లు పేర్కొన్నారు. మరో నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎస్డీఈఆర్ఎఫ్ బృందాలు చర్యలు ముమ్మరం చేశాయని కట్ని కలెక్టర్ ప్రియాంక్ తెలిపారు. రెస్కూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.
#WATCH | Of the 9 labourers trapped, 5 have been rescued after an under-construction tunnel of the Bargi underground canal caved in at Sleemanabad in Katni district of Madhya Pradesh; 4 yet to be rescued. SDERF team at the spot: Administration pic.twitter.com/O0vLdYZj8B
— ANI (@ANI) February 12, 2022
కాగా, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తంచేశారు. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, జిల్లా అధికారులను అభినందించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, మిగిలినవారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని సూచించారు.