కోల్కతా: నందిగ్రామ్ ఎన్నికల్లో సువేందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందా తప్పుకున్నారు. అయితే న్యాయవ్యవస్థను, న్యా యమూర్తిని కించపరిచినందుకు మమతకు రూ.5 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. నందిగ్రామ్ ఎన్నికల ఫలితాల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, సువే ందు ఎన్నికల చెల్లదని ప్రకటించాలని మమత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కౌశిక్ చందా ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే చందాకు బీజేపీ నేపథ్యం ఉన్నదని, కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని మమ త కోరారు. దీంతో విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ చందా తెలిపారు. అయితే సీఎం చేసిన ఆరోపణలను ఖండించారు.