లక్నో: ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో (Chitrakoot) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించగా పలువురు గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన డంపర్ కొత్వాలి ప్రాంతంలోని అమన్ఫూర్ ప్రాంతంలో ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడినవారిని జిల్లా దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.