అల్వార్: రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం ( Accident ) జరిగింది. ఓ కారు ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న 8 మందిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అల్వార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ తెల్లవారుజామున 5.30 గంటల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల వెల్లడించారు.
ఐదు సీట్ల కెపాసిటీగల కారులో మొత్తం 8 మంది ఉన్నారని, ప్రమాదంలో ఆ కారులోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారని పోలీసులు చెప్పారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కారులోని వారు కథుమార్లో గోవర్ధన్ పరిక్రమ నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.