రామ్ఘర్: జార్ఖండ్లోని రామ్ఘర్లో దారుణం జరిగింది. బస్సును ఢీకొన్న కారులో మంటలు చెలరేగాయి. ఆ అగ్నిప్రమాదం వల్ల కారులో ఉన్న అయిదుగురు మంటల్లో కాలి బూడిదయ్యారు. రామ్ఘర్ జిల్లాలో ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారి 23పై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించినవారిని ఇంకా గుర్తించలేదన్నారు.