భోపాల్: విషపూరిత పండ్లు తిన్న విద్యార్థుల్లో 49 మందికిపైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఈ ఘటన జరిగింది. బర్ఘాట్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత స్కూలులో చదివే విద్యార్థులు శుక్రవారం బడి సమీపంలోని చెట్టుకు ఉన్న రతన్జోట్ (ఆల్కనెట్) పండ్లను తిన్నారు. విద్యార్థులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాంతులు, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం 49 మంది విద్యార్థులు బర్ఘాట్లోని ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ అయ్యారు. చికిత్స అనంతరం 47 మంది డిశ్చార్జ్ కాగా, సీరియస్గా ఉన్న ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
మరో ఘటనలో బర్ఘాట్లోని మరో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 13 మందికి పైగా విద్యార్థులు రతన్జోట్ పండు తిని గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చేరిన ఆ విద్యార్థులను తర్వాత డిశ్చార్జ్ చేశారు.