న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 49 శాతం వయోజనులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రెండవ డోసు తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. యురోపియన్ దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో దాదాపు 70 శాతం కేసులు అక్కడే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన వారంలో కేవలం యూరోప్లోనే 70 శాతం కేసులు నమోదు అయినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. ఇండియాలో కేరళ, మహారాష్ట్రలో సగటున పదివేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇండియాలో నమోదు అవుతున్న కేసుల్లో 55 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు.