నైనిటాల్: ఉత్తరాఖండ్లోని (Uttarakhand) హల్ద్వాని జైలులో (Haldwani jail) హెచ్ఐవీ కలకలం సృష్టిస్తున్నది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో (Prisoners) 44 మందికి హెచ్ఐవీ (HIV) సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం. జైలులో ఎయిడ్స్ (AIDS) బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అపమత్తమయ్యారు. బాధితుల కోసం అక్కడే ఏఆర్టీ (Antiretroviral Therapy) కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సుశీలా తివారీ హాస్పిటల్కు చెందిన డాక్టర్ పరమ్జిత్ సింగ్ (Dr Paramjit Singh) చెప్పారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) నిబంధనల ప్రకారం వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. అయితే హెచ్ఐవీ సోకినవారంతా డ్రగ్స్ బానిసలేనని తెలిపారు.