డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన సిల్క్యారా సొరంగం నుంచి రక్షించిన 41 మంది కార్మికులను (Uttarakhand Tunnel rescued Workers) బుధవారం ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన చినూక్ హెలికాప్టర్లో ఎయిమ్స్ రిషికేశ్కు తరలించారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్ 12న కూలిన సొరంగంలో సుమారు 17 రోజుల పాటు చిక్కుకున్నప్పటికీ కార్మికుల్లో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊరట చెందారు.
మంగళవారం సాయంత్రం టన్నెల్ నుంచి బయటకు తెచ్చిన కార్మికులను తొలుత చిన్యాలిసౌర్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ ఆసుపత్రిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక సహాయం అందించారు.
కాగా, టన్నెల్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులను బుధవారం భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్లో ఎయిమ్స్ రిషికేశ్కు తరలించారు. వారిని ఎయిమ్స్లో ఒక రోజు పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
#WATCH | Uttarkashi tunnel rescue | IAF's transport aircraft Chinook, carrying 41 rescued workers, arrives in Rishikesh. It has been flown to AIIMS Rishikesh from Chinyalisaur for the workers' further medical examination.#Uttarakhand pic.twitter.com/hrWm1dlxsM
— ANI (@ANI) November 29, 2023