ముంబై: దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40 మంది బంగ్లాదేశీయులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. భివండీ (Bhiwandi) పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో పనిస్తున్న 40 మంది బంగ్లా జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద సరైన ధృవపత్రాలు లేవని చెప్పారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులు, పాస్పోర్టులు, పాన్ కార్డులు, రూ.94 విలువచేసే 28 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ముంబై, గుజరాత్, భివాండి చిరునామాలతో నకిలీ పత్రాలు ఉన్నాయని వెల్లడించారు. వారు తమ బంధువులు, సరిహద్దులు దాటించిన వ్యక్తితో ఐఎంపీవో యాప్ సహాయంతో మాట్లాడుతున్నారని చెప్పారు. వారందరిపై కేసు నమోదుచేశామన్నారు.