సిమ్లా: ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలకు నాలుగు అంతస్తుల బిల్డింగ్ పేక ముక్కలా కూలిపోయింది. అయితే ముందుగానే అందులోని వారిని ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చోపాల్ టౌన్ మార్కెట్ వద్ద ఉన్న నాలుగంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. అయితే అందులోని వారిని ముందుగానే ఖాళీ చేయించినట్లు విపత్తు నిర్వాహణ అధికారులు తెలిపారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని చెప్పారు.
కాగా, కూలిపోయిన బిల్డింగ్లో యూకో బ్యాంక్ శాఖ, ఒక దాబా, బార్, ఇతర వ్యాపార సంస్థలున్నాయి. రెండో శనివారం సెలవు కావడంతో పై అంతస్తులో ఉన్న బ్యాంకు మూసివేత వల్ల సిబ్బంది, కస్టమర్లకు గండం తప్పిందని ఆ బ్యాంక్ జోనల్ మేనేజర్ తెలిపారు. మరోవైపు బార్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కొందరు కిటికీ అద్దాలు పగలడం చూసి బయటకు పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం కొన్ని నిమిషాల్లో నాలుగంతస్తుల భవనం కుప్పుకూలిందని చెప్పారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Himachal Pradesh: A four-storey building collapsed in Chopal town in Shimla amid heavy rainfall. The building was already vacated by the local administration pic.twitter.com/FiJbCLty9r
— ANI (@ANI) July 9, 2022