Loksabha | న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరిట విడుదల చేసిన విజిటర్ పాస్తో లోక్సభలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు బెంచీలపై నుంచి దూకుతూ కలర్ స్మోక్ను వదిలిన ఎంపీలను భయభ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ ప్రాంగణంలో ఎల్లో స్మోక్ను వదిలి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిని పోలీసులు అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.
లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి ఆందోళన చేసిన వారిని సాగర్ శర్మ, డీ మనోరంజన్(35)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కూడా కర్ణాటకలోని మైసూర్కు చెందిన వారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇక పార్లమెంట్ వెలుపల కలర్ స్మోక్ను వదిలిన వారిని నీలం(42), అమోల్ షిండే(25) గా గుర్తించారు. నీలం హర్యానాకు చెందిన యువతి కాగా, షిండే మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన యువకుడు అని పోలీసులు పేర్కొన్నారు. మనోరంజన్ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. నీలం సివిల్ సర్వీసెస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.