రాంచీ: దసరా వేడుకలో విషాదం జరిగింది. బొగ్గు లారీ దూసుకెళ్లడంతో నలుగురు వ్యక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. జార్ఖండ్లోని రామ్గఢ్లో ఈ సంఘటన జరిగింది. నలుగురు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ఒక కుటుంబం దసరా వేడుకలకు వెళ్తున్నది. రామ్గఢ్లోని బర్కాకానా వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో బొగ్గు లోడ్తో వెళ్తున్న లారీ, రోడ్డుపై నిల్చొన్న జనం, రెండు బైక్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. జనంపైకి దూసుకెళ్లిన బొగ్గు లారీని సీజ్ చేశారు. డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దసరా పండుగ వేళ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.