బఠిండా: పంజాబ్లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్లో (Bathinda Military Station) కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో బఠిండా మిలిటరీ స్టేషన్లో కాల్పుల (Firing) ఘటన చోటుచేసుకున్నదని ఆర్మీ ప్రకటించింది. వెంటనే క్విక్ రెస్పాన్స్ బృందాలు స్టేషన్ను చుట్టుముట్టాయని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయని వెల్లడించింది. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టామని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.