నోయిడా: ఢిల్లీలోని నోయిడాలో పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 4.72 లక్షల నగదును సీజ్ చేశారు. ఓ ఎస్యూవీ కారులో వెళ్తున్న వారిని బోర్డర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో అక్రమంగా తరలిస్తున్న నగదును గుర్తించారు. ఫిబ్రవరి 10 నుంచి యూపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఢిల్లీ, హర్యానాతో బోర్డర్ ఉన్న నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో సెక్యూర్టీని పెంచారు. చెకింగ్లో భాగంగా టాటా హేరియర్ కారును సెక్టార్ 61 వద్ద తనిఖీ చేశారు. ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. దాంట్లో వాషింగ్ పౌడర్ బాక్సులు కూడా ఉన్నాయి. అయితే ఆ బాక్సులను తనిఖీ చేయగా.. వాటిల్లో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తంచారు. అరుణ్ సక్సేనా, సంజీవ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం మరో ఇద్దరి నుంచి 99 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.