Kannauj | యూపీలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పీయూశ్ జైన్, పుష్పరాజ్ జైన్ ఇళ్లపై దాడులు చేసి, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఐటీ అధికారులు కన్నౌజ్లో ఉండే మరో సుగంధ ద్రవ్యాల వ్యాపారి మహ్మద్ యాఖూబ్ ఇంటిపై దాడులు నిర్వహించారు. శుక్రవారం నుంచి ఈ దాడులు ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో 4 నుంచి 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్ని కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఈ నగదును లెక్కించడానికి నోట్ల మెషిన్లను కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు లక్నోలో ఉండే యాఖూబ్ సోదరుడు మొహసీన్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.