ముంబై: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసొలేషన్ కోచ్లను రైల్వే సిద్ధం చేస్తున్నది. తమ వద్ద 386 ఐసొలేషన్ కోచ్లు అందుబాటులో ఉన్నట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. ఇందులో 128 కోచ్లు ముంబై డివిజన్లో ఉన్నట్లు పేర్కొంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ ప్రకారం వినియోగం కోసం ఐసొలేషన్ బోగీలను సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెస్ట్రన్ రైల్వే సీపీఆర్వో వెల్లడించింది.
మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 50 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. తగినంత పడకలు లేకపోవడంతో ఒక బెడ్పై ఇద్దరు లేదా ముగ్గురు రోగులను ఉంచాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో 386 ఐసొలేషన్ కోచ్లను పశ్చిమ రైల్వే అందుబాటులోకి తెచ్చింది.