బెంగళూరు: కర్ణాటకలోని గదగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(జిమ్స్)లో 38 మంది జూనియర్ వైద్యులు రీల్స్ షూట్ చేయడం కలకలం రేపింది. దవాఖానా వరండాలో హిందీ, కన్నడ పాటలకు డ్యాన్సులు చేస్తూ రచ్చ చేసిన వారి వీడియోలు వైరల్ కావడంతో దవాఖానా మేనేజ్మెంట్ తీవ్రంగా స్పందించింది.
విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు వారు ‘ఘోర తప్పిదం’ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారేమైనా చేయాలనుకుంటే దవాఖాన బయట చేయాల్సిందని, ఇలాంటి వాటికి తాము అనుమతి ఇవ్వబోమని దవాఖాన డైరెక్టర్ డాక్టర్ బసవరాజ్ బొమ్మనహళ్లి తెలిపారు. ప్రీ గ్రాడ్యుయేషన్ వేడుక కోసమే తాము రీల్స్ షూట్ చేసినట్టు విద్యార్థులు తెలిపారని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.