డెహ్రాడూన్, అక్టోబర్ 5: ఉత్తరాఖండ్లోని పౌరి గర్హాల్ జిల్లాలో బస్సు లోయలో పడిన ఘటనలో 32 మంది మరణించారు. మరో 18 మందికి గాయాలయ్యాయి.దాదాపు 50 మందితో వెళ్తున్న ఓ పెండ్లి పార్టీ బస్సు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి 500 మీటర్ల లోతు ఉన్న ఓ లోయలో పడింది. బిరోంకల్ తాలూకా పరిధిలోని కందా గ్రామం నుంచి హరిద్వార్ జిల్లాలోని లాల్దంగ్ పట్టణానికి వస్తుండగా సిమ్రిబెంద్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.