డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు కొట్టుకుపోయి 300 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. లిపులేఖ్-తవఘాట్ రోడ్పై లఖ్నాపూర్ సమీపంలో భారీ కొండచరియలు విరిగి పడటంతో 100 మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది.
దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న 300 మందికి పైగా ప్రయాణికులు దారుడుల, గంజ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కొండచరియల తొలగింపును చేపట్టామని అధికారులు తెలిపారు.