Vote | ముంబై, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఓటు హక్కు వినియోగంపై పాఠశాలలో అధికారులు, ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో మూడో తరగతి చదివే ఆ చిన్నారి స్ఫూర్తి పొందాడు. ఓటు విలువ తెలుసుకొన్న ఆ బాలుడు.. తమ తల్లిదండ్రులు పోలింగ్ రోజున ఊరికి వెళ్తున్న విషయంపై ఏకంగా పొలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన మహారాష్ట్రలోని హింగోళి జిల్లా తాక్తోడలో చోటుచేసుకొన్నది. ‘పోలీస్ అంకుల్, మా తల్లిదండ్రులు పోలింగ్ రోజున ఊరికి వెళ్తున్నారు. పోలింగ్ రోజున వారిని అరెస్ట్ చేసి ఓటు వేయడానికి తీసుకెళ్లండి. కానీ, ఓటేసిన తర్వాత మళ్లీ వదలిపెట్టండి’ అంటూ సాయిరామ్ కైలాస్ పోలీసులకు ఒక లేఖ రాశారు. బాలుడి స్ఫూర్తిని మెచ్చుకొన్న పోలీసులు… రిజిస్టర్లో ఈ లేఖను నమోదు చేశారు.