శ్రీనగర్: స్వతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాజౌరీలోని ఆర్మీ బేస్ క్యాంప్పై ముష్కరులు ఆత్మాహుతి దాడి చేశారు. దీంతో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్హల్ ప్రాంతంలోని పర్గల్లో ఉన్న సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.
J&K | In a terrorist attack 25 kms from Rajouri, two terrorists carried out a suicide attack on an Army company operating base. Both terrorists killed while 3 soldiers lost their lives. Operations in progress.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/Qt7TsAawki
— ANI (@ANI) August 11, 2022
గురువారం వేకువజామున ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ దాటుకుని లోపలకు చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బేస్క్యాంప్ పరిసర ప్రాంతాల్లో ఇంకెవరైనా ఉన్నారనే అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.