లక్నో: ఒక చోట పోలీస్ వ్యాన్ను నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్లో ఉన్న ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. (Prisoners Escape From Police Van) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. రైల్వే స్టేషన్లో చోరీలకు పాల్పడి అరెస్టైన ఏడుగురు రిమాండ్ ఖైదీలను ఈ నెల 19న ఝాన్సీ రైల్వే కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఒక చోట పోలీస్ వ్యాన్ను నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. అయితే ఖైదీలున్న ఆ వ్యాన్ వద్ద గస్తీగా పోలీసులు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్లో ఉన్న ఏడుగురు ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, పారిపోయిన రిమాండ్ ఖైదీలను 27 ఏళ్ల బ్రిజేంద్ర, 20 ఏళ్ల శైలేంద్ర, 23 ఏళ్ల జ్ఞానప్రసాద్గా గుర్తించారు. రైల్వే స్టేషన్లలో మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించిన ఈ నిందితులు రిమాండ్ నిమిత్తం జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు ఎస్ఐలతో సహా ఎనిమిది మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే రిమాండ్ ఖైదీల పరార్పై కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
झांसी में तीन कैदी पुलिस वैन से फरार@Uppolice @jhansipolice pic.twitter.com/kq4n74zzfk
— Anmol dubey ( अनमोल दुबे ) (@anmoldubey110) September 21, 2023