కోల్కతా: ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. (Bengal Blast) పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆ ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఖయర్తాలా ప్రాంతంలోని ఒక ఇంట్లో దేశీయ బాంబులు పేలాయి. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. రాత్రి వేళ పేలుడు శబ్దం విని స్థానికులు భయాందోళన చెందారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడులో ముగ్గురు మరణించగా పలువురు గాయపడినట్లు తెలిపారు. మృతులను మామున్ మొల్లా, సకీరుల్ సర్కార్, ముస్తాకిన్ షేక్గా గుర్తించినట్లు చెప్పారు. మామున్ మొల్లా ఇంట్లో దేశీయ బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాంబులు పేలడంతో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.