శ్రీహరికోట : దేశీయ నావిగేషన్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కొత్తగా శాటిలైట్ను ఇస్రో ప్రయోగించనున్నది. మే 29న నావిక్ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నది. 10.42 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించనున్నారు.
ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్)లో మొత్తం ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. సాధారణ పౌరులతో పాటు, మిలటరీ లాంటి వ్యూహాత్మక వినియోగదారులకు ఇది ఉపయోగపడనున్నది. విమాన, సముద్ర రవాణా, లోకేషన్, శాస్త్రీయ పరిశోధనలు, సర్వేలకు దీన్ని ఉపయోగించవచ్చు.