రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్లో ఆందోళన నెలకొంది. చింతగుప్పలోని సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్కు చెందిన 28 మంది జవాన్లు ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్లే జవాన్లు అనారోగ్యం పాలయ్యారు.
అస్వస్థతకు గురైన జవాన్లను సీఆర్పీఎఫ్ ఫీల్డ్ ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. జవాన్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పాత ఆవాల నూనెతో వండిన ఆహారం తినడం వల్లే జవాన్లు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై స్పందించిన కమాండెంట్ రాజేశ్ యాదవ్ విచారణకు ఆదేశించారు.