న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన ఢిల్లీలోని కర్తవ్యపథ్పై జరిగే ఆర్డీ పరేడ్లో పాల్గొనే సీఆరీపీఎఫ్ మార్చింగ్ బృందానికి సిమ్రన్ బాలా(Simran Bala) కమాండెంట్గా వ్యవహరించనున్నారు. 26 ఏళ్ల ఆ మహిళా ఆఫీసర్.. జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా చేస్తున్నారు.గతంలో ఆర్డీ పరేడ్ సమయంలో వివిధ బృందాలకు సీఆర్పీఎఫ్ మహిళా ఆఫీసర్లు కమాండ్ చేశారు. కానీ 140 మంది పురుషులతో నిండిన సీఆర్పీఎఫ్ బృందానికి ఓ మహిళా ఆఫీసర్ కమాండెంట్ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి అవుతుంది.
జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాకి చెందిన సిమ్రన్ బాలా.. పారామిలిటరీ దళంలో ఆఫీసర్ ర్యాంక్లో చేరిన తొలి మహిళగా రికార్డు క్రియేట్ చేశారు. దేశంలోని అంతర్గత భద్రతకు చెందిన సీఆర్పీఎఫ్ దళంలో సుమారు 3.26 లక్షల సిబ్బంది ఉన్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్, జమ్మూకశ్మీర్లో కౌంటర్ టెర్రరిజం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటు ఏరివేతల టార్గెట్గా సీఆర్పీఎఫ్ దళాలు పనిచేస్తున్నాయి.
జమ్మూలోని గాంధీనగర్లో ఉన్న ప్రభుత్వ మహిళా కాలేజీలో సిమ్రన్ బాలా పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2025 ఏప్రిల్లో ఆమె సీఆర్పీఎఫ్ దళంలో చేరింది. చత్తీస్ఘడ్లోని బస్తరియా బాటాలియన్లో ఆమె తొలి పోస్టింగ్. యాంటీ నక్సల్ ఆపరేషన్లో పాల్గొన్నది. శిక్షణ సమయంలో సీఆర్పీఎఫ్ అకాడమీలో ఆమె బెస్ట్ ఆఫీసర్ అవార్డు గెలుచుకున్నది. యూపీఎస్సీ నిర్వహించే సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్షలో ఆమె క్వాలిఫై అయ్యింది.