Madhya Pradesh | భోపాల్, జనవరి 6: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక వస తి గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. వీరంతా గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన వారు. అయితే అదృశ్యమైన వారిలో 12 మం దిని పోలీసులు పట్టుకున్నారు. బాలికల అదృశ్యానికి బాధ్యులను చేస్తూ ఇద్దరు శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులను సస్పెండ్ చేయ గా, ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. అంతకుముందు భోపాల్ శివారు పర్వాలియా ప్రాం తంలోని ఆంచల్ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం బాలల హక్కుల పరిరక్షణ జాతీ య కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్మన్ ప్రియాం క్ కనుంగో ఆకస్మిక తనిఖీ సందర్భంగా బాలికల అదృశ్యం వెలుగు చూసింది.
తనిఖీలో 68 మంది బాలికల్లో 26 మంది అక్కడ లేనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆశ్రమాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించడమే కాక అందులో అనేక అక్రమాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తప్పిపోయిన బాలికలు 6 నుంచి 18 సంవత్సరాల లోపు వారని, వీరిలో కొందరు వీధుల్లో అనాథలుగా ఉన్నవారని, వారు వివిధ మతాలకు చెందిన వారైనా అందరికీ క్రైస్తవాన్ని నూరిపోస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ పురుష గార్డులు విధులు నిర్వహిస్తున్నారని ప్రియాంక కనుగో ట్వీట్ చేశారు.