న్యూఢిల్లీ, జనవరి 2: నల్లధనం, దొంగ నో ట్లు, టెర్రర్ ఫండింగ్ లక్ష్యంగా 2016 నవంబర్ 8న నోట్ల రద్దు చేసినట్టు కేంద్రం చెప్తు న్నా.. వాస్తవంలో ఆ లక్ష్యం నెరవేరినట్టు కనిపించటం లేదు. అందుకు జాతీయ నేర ని యంత్రణ విభాగం (ఎన్సీఆర్బీ) ప్రకటించిన గణాంకాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2016 నుంచి మొత్తం రూ. 245.33 కోట్ల దొంగ నోట్లు పట్టుబడ్డాయి.