Gujarat | న్యూఢిల్లీ, మే 23: కలుషితమైన నీళ్లు తాగడంతో 25 ఒంటెలు మృతిచెందాయి. ఈ ఘటన గుజరాత్లోని భారూచ్ జిల్లాలో చోటుచేసుకున్నది. పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు కాలువల్లో చేరటం.. ఈ నీళ్లను పశువులు, పక్షులు తాగి చనిపోవటం గుజరాత్లో పరిపాటిగా మారింది.
అయితే రసాయనాలు కాలువల్లో కలువకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. తాజాగా ఈ నీళ్లను తాగి ఏకంగా 25 ఒంటెలు మరణించాయి.