న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది యాత్రికులు మరణించగా, 10 మంది గాయపడ్డారు.
మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు యాత్రికులు ట్రాక్టర్లో వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున కాస్గంజ్ వద్ద అదుపుతప్పిన వాహనం కొలనులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక దవాఖానకు తరలించారు.