కోల్కతా: మేము అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ గిఫ్ట్మనీ తిరిగి వస్తుంది. అయితే దీనికోసం మీరు కొంతమేర చెల్లించాల్సి వస్తుందని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశీయులను టార్గెట్గా చేసుకుని ఏకంగా కాల్సెంటర్నే నడుపుతున్న యువకులు కటకటాలపాలైన ఘటన పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో జరిగింది.
కోల్కతాలోని న్యూ అలీపూర్లో 22 మంది యువకులు కలిసి ఓ కాల్ సెంటర్ను నడుపుతున్నారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ కమ్యూనికేషన్ సిస్టమ్ను ఉపయోగించి తాము అమెజాన్ ఉద్యోగులమని, మీ గిఫ్ట్ మనీ వాపసు వస్తుందని అమాయకులను నమ్మిస్తారు. దానికోసం వారి నుంచి కొంత మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. అయితే స్పష్టమైన సమాచారంతో పోలీసులు కాల్సెంటర్పై దాడిచేశారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు.
సరైన పత్రాలు లేకుండా కాల్సెంటర్ను నడుపుతున్నారని, గిఫ్ట్లను ఎరగా చూపి అమాయకుల నుంచి డబ్బులు లాగుతున్నారని పోలీసులు తెలిపారు. వీరి చేతుల్లో మోసపోయినవారు అధికంగా ఆస్ట్రేలియాకు చెందినవారే ఉన్నారని, వారినుంచి ఆస్ట్రేలియన్ డాలర్లు తీసుకునేవారని చెప్పారు. టార్గెట్ చేసిన కంప్యూటర్లను నియంత్రించడానికి టీమ్వ్యూవర్, ఎనీడెస్క్ వంటి సాఫ్టవేర్లను ఉపయోగించేవారని చెప్పారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.