న్యూఢిల్లీ, మే 30: వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తూ మంగళవారం కేంద్రం ప్రకటన జారీ చేసింది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ తదితర రంగాల్లో ఎనలేని సేవలు చేసినవారిని, అనేకమందికి స్ఫూర్తిగా నిలిచినవారిని ‘పీపుల్స్ పద్మ 2024’కు నామినేట్ చేయాలని కేంద్రం సూచించింది.
నామినేషన్లు, రికమెండేషన్లను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో స్వీకరిస్తున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 15 లోపు నామినేషన్లు పంపాలని పేర్కొంది. వివిధ రంగాల్లో నిస్వార్థ సేవలు అందించిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు, వికలాంగుల పేర్లను సిఫారసు చేయాలని ప్రజలను కోరింది.