న్యూఢిల్లీ: భారత్లోని లౌకిక , ప్రజాస్వామ్య వాదాన్ని పరీక్షించేందుకు రాబోయే లోక్సభ ఎన్నికలు కీలకమైనవని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) అన్నారు. ఎందుకంటే గడిచిన పదేళ్లలో ప్రజాస్వామ్య మూలస్తంభాలపై దాడి జరిగినట్లు ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి పాపులారిటీ వస్తోందని, అయితే ఎన్నికల్లో అన్ని పార్టీలకు అవకాశం దొరకడం బట్టి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ దేశ అస్థిత్వవాదానికి రాబోయే ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. లౌకిక ప్రజాస్వామ్య వాదాన్ని నిలుపుకుంటామా లేదా అన్న విషయం వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. రాజ్యాంగ విలువలపై గత పదేళ్లు దారుణమైన దాడి జరిగిందన్నారు.రాజ్యాంగంలోని మూలస్తంభాలపై కూడా అటాక్ జరిగిందన్నారు. రాజ్యాంగ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి పనిచేస్తోందన్నారు. వర్గ హింస ద్వారా ఓట్లు రాబట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈడీ, సీబీఐ లాంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.