కోటా: దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. ఆత్మహత్యలను (Suicide) నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న (Neet Aspirant) ఓ అభ్యర్థి వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తానుంటున్న గదిలో సూసైడ్ చేసుకున్నాడు. అతడిని పశ్చిమబెంగాల్కు చెందిన 20 ఏండ్ల ఫరీద్ హుస్సేన్గా (Faureed Hussain) గుర్తించారు. అతడు మరికొంత మంది విద్యార్థులతో కలిసి కిరాయికి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. దీంతో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 28కి చేరింది.
ఈ మధ్యకాలంలో విద్యార్థులు బలవన్మరణాల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోచింగ్ సెంటర్లతోపాటు హాస్టళ్లు, కిరాయికి ఇచ్చే నివాసాల్లో ఫ్యాన్లకు యాంటీ హాంగింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రెండు నెలలపాటు ఎఆలంటి పరీక్షలు నిర్వహించకూడదని కోచింగ్ సెంటర్లక నిర్వాహకులకు నిర్ధేశించారు.