బెంగళూరు: కర్ణాటకలోని ఓ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకయింది. మంగళూరులోని (Mangalore) బైకంపడి పారిశ్రామిక వాడలో ఉన్న ఎవరెస్ట్ సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం రాత్రి అమ్మోనియా గ్యాస్ (Ammonia gas) లీకైంది. గ్యాస్ లీకేజీతో 20 కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 80 కార్మికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లీకేజీకిగల కారణాలు ఇంకా తెలియరాలేదు.