అగర్తలా: త్రిపుర వార్తలపై అరెస్టైన ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్ లభించింది. సమృద్ధి సకూనియా, స్వర్ణ ఝా అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు చేస్తున్న వార్తల కవరేజీ వివిధ వర్గాల ప్రజల మధ్య మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉన్నదని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిష్త్కు చెందిన కార్యకర్త కాంచన్ దాస్ ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దని అస్సాంలోని కరీంగంజ్లో ఆదివారం అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, ఒక్కొక్కరికి రూ.75,000 పూచీకత్తుపై ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులకు గోమతి జిల్లాలో కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు వారి తరుఫు న్యాయవాది పిజూష్ బిస్వాస్ తెలిపారు. కేసు నమోదైన కక్రాబాన్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని కోర్టు వారిని ఆదేశించినట్లు చెప్పారు. పోలీసుల విచారణ అనంతరం వారిని విడుదల చేస్తారని వెల్లడించారు.
మరోవైపు హెచ్డబ్ల్యూ న్యూస్ నెట్వర్స్కు చెందిన మహిళా జర్నలిస్టులు సమృద్ధి సకూనియా, స్వర్ణ ఝాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది.