శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. మిత్రిగామ్ ప్రాంతంలో బుధవారం పొద్దుపోయాక భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, అంతకు ముందు జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మార్చి-ఏప్రిల్ మధ్య ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులపై దాడులకు పాల్పడిన వరుస ఘటనల్లో పాల్గొన్నారని ఐజీపీ కశ్మీర్ విజయ్కుమార్ పేర్కొన్నారు.
మృతులు ఐజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్గా గుర్తించగా.. అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు ఏకే 47 రైఫిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ ఉగ్రవాది సహా ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, బలగాలు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు. అయితే, పౌరుల తరలింపు కారణంతో ఆపరేషన్ను మధ్యలో నిలిపివేశారు.