న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) క్యాంపస్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు కర్రలు చేతపట్టి హంగామా చేశారు. తపతి హాస్టల్కు చెందిన కొందరు విద్యార్థులు మరో హాస్టల్కు చెందిన విద్యార్థులతో గురువారం గొడవ పడ్డారు. దీంతో రెండు గ్రూపుల మధ్య ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా కర్రలతో వారు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో ఘర్షణకు దిగిన విద్యార్థులు పారిపోయారు. అయితే ఇద్దరు విద్యార్థుల మధ్య వ్యక్తిగత ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ గొడవకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు. ఎవరి నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు. మరోవైపు జేఎన్యూ క్యాంపస్లో విద్యార్థులు కర్రలు చేతపట్టి హంగామా చేస్తున్న వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
On Camera, Men Seen Walking With Sticks At JNU, Clash Between 2 Groups https://t.co/kFprI2WJWq pic.twitter.com/To6b4dw3Sb
— NDTV (@ndtv) November 10, 2022