లక్నో: నడుస్తున్న కారుపై (Moving cars) స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులకు పోలీసులు షాకిచ్చారు. రూ.లక్షకు పైగా ఫైన్ వేయడంతోపాటు కేసు నమోదుచేశారు. ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) బరేలీలో (Bareilly) పూటుగా తాగిన యువకులు హైవైపై రెండు స్కార్పియో (Scorpio) కార్లలో బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ముందు డోర్ నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి కారు బానెట్పై నిలబడ్డాడు. వెనక వస్తున కారులో మరో వ్యక్తి డోరులోనుంచి బయట నిలబడ్డాడు. ఈ ఘనకార్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో (Social media) పోస్టు చేశారు. అదికాస్తా వైరల్ అవడంతో.. ఓ వ్యక్తి సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియో ఆధారంగా కార్ల నంబర్లను గుర్తించారు. వారిపై చెరో రూ.52 వేల చొప్పున జరిమానా విధించారు. చాలాన్లను (Challans) వాటి యజమానులకు పంపించారు. ఇక నడుస్తున్న కారుపై స్టంట్స్ చేసిన ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదుచేశారు.