రాంచీ: జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమెతో ప్రమాణం చేయించనున్నారని అధికార పార్టీ నేత వెల్లడించారు.
దుమ్రీ జేఎంఎం (JMM) ఎమ్మెల్యే, విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రి జగర్నాథ్ మహతో చెన్నైలోని దవాఖానలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 6న మరణించారు. దీంతో అప్పటినుంచి ఆ స్థానం ఖాళీగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బేబీ దేవి ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.