న్యూఢిల్లీ: సుమారు వంద కోట్లు ఖరీదు చేసే గస్తీ నౌకను సీషెల్స్కు ఇవాళ భారత్ గిఫ్ట్ ఇవ్వనున్నది. ప్రధాని మోదీ, సీషెల్స్ అధ్యక్షుడి మధ్య ఇవాళ సాయంత్రం వర్చువల్ భేటీ జరగనున్నది. ఆ సమయంలో పెట్రోలింగ్ నౌకను ఆ దేశానిని భారత్ కానుగా ఇవ్వనున్నది. మార్చి 16వ తేదీన గస్తీ నౌకను డెలివరీ చేశారు. కానీ అధికారికంగా ఇవాళ దాన్ని సీషెల్స్ కోస్టు గార్డుకు అందించనున్నారు. ఇప్పటికే మూడు గస్తీ నౌకలను ఇండియా ఆ దేశానికి అందజేసింది. పీఎస్ తోపాజ్(2005), పీఎస్ కాన్స్టాంట్(2014), పాట్రోల్ బోట్ హెర్మస్(2016)లను ఇప్పటికే బహూకరించింది. ఇక ఫాస్ట్ పాట్రోల్ వెస్సల్ నాలుగవది కానున్నది. గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ దీన్ని నిర్మంచింది. పెట్రోలింగ్, యాంటీ స్మగ్లింగ్, యాంటీ పౌచింగ్ కార్యక్రమాలకు దీన్ని వాడుతారు. పెట్రోలింగ్ నౌకతో పాటు ఒక మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను కూడా భారత్ అప్పగించనున్నది.