Grenade Attacks | భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో గ్రనేడ్ దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక పౌరుడు గాయపడ్డారు. బుద్గాం జిల్లాలోని చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్లో ఒక పౌరుడు గాయ పడ్డాడు. గాయపడిన పౌరుడిని కరన్ కుమార్ సింగ్ అని పోలీసులు గుర్తించారు.
శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపాన్నే మరో ఘటన జరిగింది. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్లతో ఒక పోలీస్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. గత మూడు రోజులుగా జమ్ముకశ్మీర్లో దాడులు కొనసాగుతున్నాయి. శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు దుర్మరణం పాలయ్యారు.