న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి సజ్జన్ కుమార్ (80) మృతి చెందారు. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన గురువారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన సఫ్దర్ జంగ్ దవాఖానకు తరలించారు. అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో 1984 నవంబర్ 1న చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో 2,700 మంది చనిపోయారు.
ఇదే అల్లర్లలో 3,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు సిక్కుల హత్యకు సంబంధించిన కేసులో సజ్జన్ దోషిగా తేలడంతో 2018లో ఢిల్లీ హైకోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. ఇద్దరు తండ్రీ కొడుకుల హత్య కేసులోనూ సజ్జన్ దోషిగా తేలారు. ఈ కేసులపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఇంకా విచారణ కొనసాగుతున్నది.